తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు..”కాంతార’ హీరో

హోంబలే ఫిలింస్ పతాకంపై ‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ నిర్మించిన తాజా చిత్రం “కాంతార”.రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు తదితరులు నటించారు.ఈ చిత్రం కన్నడ వెర్షన్ లో సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 15న ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది. మొదటి రోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం నేడు 20 కోట్లు గ్రాస్ ను సాధించింది. ఒక చిత్రం కేవలం మౌత్ టాక్ తో ఈ స్థాయిలో విజయం అవ్వడం అనేది అరుదైన విషయం..కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టింది “కాంతార’ చిత్రం.ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది

ప్రముఖ  నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మేము రిలీజ్ చేసిన “కాంతార” చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ సినిమా ఎం ప్రూవ్ చేసింది అంటే సినిమాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కానీ ఎమోషన్ బ్యారియర్ ఒక�