ఎస్ఆర్కే ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 ప్రకటన

స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కే విజయ్ భాస్కర్ కొంత విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.విజయ భాస్కర్‌ దర్శకత్వంలోవస్తున్న 13వ చిత్రమిది. ఈ చిత్రానికి సంబధించిన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్‌లోని మణికొండలో ఘనంగా జరిగింది. విజయ భాస్కర్, జీవిత రాజశేఖర్, కార్తికేయ నిర్మాత బొగ్గరం వెంకట శ్రీనివాస్, పారిశ్రామికవేత్త, నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ ఈ వేడుకకు హాజరై నిర్మాతకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ..రాబోవు విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమౌతుందని, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఆ రోజు వెల్లడిస్తామని తెలిపారు.ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఈ చిత్రం కోసం యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే కథని సిద్ధం చేశారు దర్శకులు విజయభాస్కర్.

Related Posts