తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ రాజకీయ వేడి రాజుకుంటోంది. మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించేందుకు ‘వ్యూహం, శపథం‘ చిత్రాలతో సిధ్ధమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘వ్యూహం, వ్యూహం 2 (శపథం)‘ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. వై.ఎస్.జగన్ జీవితకథతో రూపొందుతోన్న ‘వ్యూహం‘ చిత్రాన్ని నవంబర్ 10న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి రెండో భాగంగా రాబోతున్న ‘శపథం’ సినిమాని జనవరి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు జగన్ జీవితకథతో రూపొందుతోన్న ‘యాత్ర 2‘ కూడా వచ్చే యేడాది ఫిబ్రవరి 8న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ సినిమాలో జగన్ పాత్రను మరో తమిళ నటుడు జీవా పోషిస్తున్నాడు. మొత్తంమీద.. నవంబర్ 10 నుంచి ఫిబ్రవరి 8 వరకూ మూడు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు జగన్ కథాంశంతో థియేటర్లలోకి రాబోతున్నాయన్నమాట.
