యంగ్ టైగర్ తో రామ్ చరణ్‌ హీరోయిన్

టాలీవుడ్ లో మరో సెన్సేషనల్ కాంబినేషన రాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీకి బాలీవుడ్ లో జెండా ఎగురవేసి ప్రస్తుతం హాలీవుడ్ లో అదరగొడుతోన్న బ్యూటీని తీసుకుంటున్నారు అనే టాక్ హల్చల్ చేస్తోంది. అది కూడా ప్రశాంత్ నీల్ సినిమాలో. ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తర్వాత ప్రశాంత్ నీల్ మూవీకి ప్రియాంక చోప్రాను తీసుకోబోతున్నారు అనే వార్త అటు కోలీవుడ్ తో పాటు శాండల్ వుడ్ కూడా బలంగా వినిపిస్తోంది.


ప్రియాంక చోప్రా గతంలో రామ్ చరణ్ సరసన తుఫాన్ సినిమాలో నటించింది. బాలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన జంజీర్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. తెలుగులో కూడా మినిమం ప్రభావం చూపించలేకపోయింది. మగధీరతో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లోజెండా ఎగరేయాలనుకున్న రామ్ చరణ్‌ తుఫాన్ తో భంగపడ్డాడు అనే చెప్పాలి.


ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ ను పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ డస్కీ బ్యూటీ బాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చి హాలీవుడ్ లో బ్రేకుల్లకుండా దూసుకుపోతోంది. రీసెంట్ గా అక్కడ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో స్పైగా నటించింది. ఈ సిరీస్ లో తను ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. యాక్షన్ తో పాటు ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్స్ లో అదరగొట్టింది. అలాంటి తనను ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో తీసుకుంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ కు ఓ రేంజ్ లో హైప్ వస్తుందనే చెప్పాలి. కాకపోతే ఈ వార్త ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు.

Related Posts