DJ Tillu : డిజే టిల్లు2 నుంచి బిగ్ అప్డేట్

డిజే టిల్లు.. లాస్ట్ ఇయర్ టాలీవుడ్లో ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 2022 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ మూవీకి యూనానిమస్ గా హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా టిల్లు, రాధికల పాత్రలు ప్రతి ఒక్కరికీ రిజిస్టర్ కావడమే కాదు.. చాలామందికి సినిమాలోని అన్ని డైలాగ్స్ గుర్తున్నాయి.

చూడ్డానికి కామెడీ ఎంటర్టైనర్ లా కనిపించినా.. హ్యూమన్ ఎమోషన్స్ తో పాటు డబ్బుంటే మనిషి తన రిలేషన్స్ ను వదులుకుంటాడు.. మనీ వల్ల మానవత్వం ఎలా మారిపోతుంది అనే కోణాలు కూడా కనిపిస్తాయీ చిత్రంలో. ఇక రాధిక పాత్రలో నటించిన సెన్సువల్ బ్యూటీ నేహా శెట్టి గ్లామర్ తో పాటు సిద్ధు జొన్నలగడ్డతో తన కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి.

అందుకే ఈ మూవీ ఇప్పటికీ ఇంకా చెబితే ఎప్పటికీ చాలామందికి మోస్ట్ ఫేవరెట్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే ప్రేక్షకుల అంచనాలు మరో రేంజ్ లో ఉంటాయి. ఆ అంచనాలను అందుకునేందుకు ఈ సారి డిజే టిల్లు స్క్వేర్ అంటూ వస్తున్నాడు సిద్ధు.


ఫస్ట్ పార్ట్ కు విమల్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. రెండో పార్ట్ కు అతనికీ హీరోకు మధ్య విభేదాలు వచ్చాయి అని చెప్పారు. అందుకే ఈ సారి మల్లిక్ రామ్ సెకండ్ పార్ట్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ డిజే టిల్లు స్క్వేర్ లో ఈ సారి రాధిక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండటం విశేషం.

ఇక ఈ చిత్రాన్ని ఈ యేడాది సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే హీరోయిన్ తో సిద్దు రొమాన్స్ ఫస్ట్ పార్ట్ కు మించి ఉంటుంది అనేలా ఉంది. అనుపమ కూడా ఇంతకు ముందులా కాక ఈ పాత్ర డిమాండ్ చేసినంత గ్లామర్ కురిపించింది అనిపిస్తోంది.నిజానికి ఈ మూవీలో హీరోయిన్ విషయంలో చాలా రచ్చ నడిచింది. మొదట్లో శ్రీ లీల అనుకున్నారు. తను నో చెప్పింది.

తర్వాత అనుపమను తీసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత తను ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో మరో మళయాలీ బ్యూటీ మడోన్నా సెబాస్టిన్ తో ఫోటో షూట్ కూడా చేశారు. ఎందుకో తను యాప్ట్ గా లేదనుకున్నారు.

మళ్లీ అనుపమనే ఒప్పించారు. అలా హీరోయిన్ విషయంలో చాలా ట్విస్ట్ లు చూసిన డిజే టిల్లు స్క్వేర్ సెప్టెంబర్ 15 నుంచి రాధికతో కలిసి తన మ్యాడ్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నాడుట.

Related Posts