ఆదిపురుష్‌ ఫంక్షన్ కు అతనెందుకు రాలేదు

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. దాదాపు లక్షకుపైగా అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లారు. ప్రభాస్ స్పీచ్ చాలామందిని ఆకట్టుకుంది. కృతి సనన్ కొంచెం తెలుగులో కూడా మాట్లాడాటం ఫ్యాన్స్ కు నచ్చింది.

దర్శకుడు ఓమ్ రౌత్ మాటల్లో అతిశయోక్తులు కనిపించినా.. ఓవరాల్ గా ఫంక్షన్ ను బాగానే అరేంజ్ చేశారు. ఇక ఈ వేదికపై సినిమాలో లక్ష్మణుడుగా నటించిన సన్నీ సింగ్, హనుమంతుడుగా కనిపించిన దేవదత్త నాగేలు కూడా పాల్గొని స్పీచ్ లు ఇచ్చారు.కానీ రామాయణ కావ్యానికి అసలు కారణమైన పాత్ర చేసిన సైఫ్ అలీఖాన్ మాత్రం ఈ వేదికపై కనిపించలేదు. దీంతో ఇదో పెద్ద లోటుగా భావిస్తున్నారు ప్రేక్షకులు.


రావణ పాత్ర చేయడం అదృష్టం అని చెప్పలేకపోవచ్చు.. కానీ ఎంత కాదనుకున్నా కేవలం ఇదో సినిమా. ఈ సినిమాకు సంబంధించి అతని ఎక్స్ పీరియన్స్ కూడా యాడ్ అయితే సినిమాకే ప్లస్ అవుతుంది. బట్ సైఫ్‌ ఇక్కడే కాదు.. ఇప్పటి వరకూ ఏ ప్రమోషనల్ యాక్టివిటీలో కూడా కనిపించడం లేదు.

మరి కావాలనే మేకర్స్ అతన్ని పక్కన బెడుతున్నారా లేక అతనికి ఇతర బిజీ షెడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలియడం లేదు కానీ.. ఈ మొత్తంలో సైఫ్ ముస్లీం కాబట్టే పిలవడం లేదు అని కొందరు.. ఆ కారణంగానే అతను రావడం లేదు అని ఇంకొందరు ఎవరికి వారుగా విడిపోయి మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఒకప్పుడు హీరోగా సైఫ్‌ కు బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఆక్రేజ్ ను ప్రమోషన్స్ లో కూడా ఉపయోగిస్తేనే నార్త్ బెల్ట్ లో ప్లస్ అవుతుంది.

Related Posts