ముగిసిన ‘సిరివెన్నెల’ అంత్యక్రియలు

దిగ్గజ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. చితికి పెద్ద కుమారుడు యోగేశ్వరశర్మ నిప్పంటించారు.

ఉదయం ‘సిరివెన్నెల’ భౌతిక కాయాన్ని ఆయన నివాసం నుంచి ఫిలింఛాంబర్‌కు తీసుకొచ్చారు. అక్కడ సిరివెన్నెల పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని వారంతా గుర్తుచేసుకున్నారు. మహాప్రస్థానం లో అధికార లాంఛనాలతో సిరివెన్నెల అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు.

Related Posts