సీఎం జ‌గ‌న్ తో చిరు మీటింగ్… స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించేనా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి క‌లిసేందుకు గురువారం మ‌ధ్యాహ్నం అపాయింట్ మెంట్ ఇచ్చారు. వీరిద్ద‌రూ క‌లిసి లంచ్ చేయ‌నున్నారు. సీఎం జ‌గ‌న్ ను ఇప్పుడు చిరంజీవి క‌ల‌వ‌డం ఆస‌క్తిగా మారింది. కార‌ణం ఏంటంటే… గ‌త కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల రేట్లు త‌గ్గించ‌డం.. థియేట‌ర్లును సీజ్ చేయ‌డంతో సినీ ప్ర‌ముఖులు జ‌గ‌న్ ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పాల‌నుకున్నారు.

అయితే.. ఇప్పుడు చిరంజీవికి అపాయింట్ మెంట్ ఇవ్వ‌డంతో జ‌గ‌న్ ద‌గ్గ‌ర చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావిస్తార‌ని.. స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని సినీ జనాలు ఆశిస్తున్నారు. ఇటీవ‌ల వైసీపీ నాయ‌కుడు సినిమా వాళ్ల‌కు బ‌లిసింది అంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. దీని గురించి త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వజ‌, ఎన్.వి.ప్ర‌సాద్ త‌దిత‌రులు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు.

దీంతో రోజురోజుకు ఈ వివాదం మ‌రింత‌గా పెరుగుతుండ‌డంతో ఇక ఫుల్ స్టాప్ పెట్టాల‌ని జ‌గ‌న్ కూడా అనుకున్న‌ట్టున్నారు. అందుక‌నే చిరంజీవికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. చిరంజీవి కూడా ప‌రిశ్ర‌మ స‌మ‌స్యలు అన్నింటికి జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌కు వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్కారం చూపించాల‌ని జ‌గ‌న్ ను చిరంజీవి కోర‌నున్న‌ట్టు స‌మాచారం.

Related Posts