పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. ఈ పాన్ ఇండియా మూవీని ప్రపంచ వ్యాప్తంగా జనవరి 14న విడుదల చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే.. ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడడంతో రాధేశ్యామ్ మూవీ కూడా వాయిదా పడుతుందా..? అనౌన్స్ చేసిన డేట్ కే విడుదల అవుతుందా..? అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. ఆర్ఆర్ఆర్ వాయిదా పడినప్పటి నుంచి రాధేశ్యామ్ మూవీ కూడా వాయిదా పడనుందని టాలీవుడ్ లో గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఈ రోజు రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ఇంటర్ వ్యూలు ప్లాన్ చేశారు. ఆతర్వాత క్యాన్సిల్ చేశారు. దీంతో రాధేశ్యామ్ విడుదల వాయిదా పడింది. అందుకనే ప్రభాస్ ఇంటర్ వ్యూలును క్యాన్సిల్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి.ఈ వార్తల పై రాధేశ్యామ్ మేకర్స్ స్పందించారు.
ఇంతకీ ఏమన్నారంటే.. రాధేశ్యామ్ మూవీ వాయిదా అంటూ వస్తున్న వార్తలను నమ్మద్దు. ఈ మూవీ ఇంతకు ముందు ప్రకటించినట్టుగా సంక్రాంతి కానుకగా జనవరి 14నే విడుదల చేయనున్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే.. క్లారిటీ అయితే ఇచ్చారు కానీ.. నార్త్ లో చాలా రాష్ట్రాల్లో థియేటర్ల్ మూతపడడం వలన రాధేశ్యామ్ వాయిదా అనేది కన్ ఫర్మ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి.. ఏం జరగనుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.