పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ పిరియాడిక్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. సంక్రాంతికి రావాల్సిన రాధేశ్యామ్ కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. మార్చిలో రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఇదిలా ఉంటే… రాధేశ్యామ్ తో పాటు ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్టె కె, స్పిరిట్ చిత్రాలు చేస్తున్నారు.
అయితే… తాజాగా యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ ఫ్యామిలీ స్టోరీ చేసేందుకు ఓకే చెప్పాడని సమాచారం. ఇదేంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏంటి..? మారుతితో సినిమా చేయడం ఏంటి..? అనుకుంటున్నారా..? కానీ.. ఇది నిజంగా నిజం. గత కొన్ని రోజులు నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వచ్చినప్పటికీ… రూమర్ అనుకున్నారు. అయితే… ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దాదాపుగా కన్ ఫర్మ్ అయ్యిందని టాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య, ఆచార్య ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న భారీ సినిమాల గ్యాప్ ల్లో ఈ సినిమాను ఫినిష్ చేయాలన్నది ఆలోచనగా తెలుస్తోంది. రాజా డీలక్స్ అనే డిఫరెంట్ టైటిల్ లో ఈ సినిమా తెరకెక్కించనున్నారని సమాచారం. సినిమా కలర్ ఫుల్ గా, ఫ్యామిలీ సబ్జెక్ట్ తో, అ�