“ల‌క్ష్య” ఆకట్టుకునే స్పోర్ట్స్ డ్రామా అవుతుంది – నిర్మాత‌లు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్‌మోహ‌న్

నాగశౌర్య కొత్త సినిమా లక్ష్య ఈ నెల 10న రిలీజ్ కు రెడీ అవుతోంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రూపొందించిన ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అంటున్నారు నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్ మోహన్ రావు, శరత్ మరార్. చిత్ర విడుదల సందర్భంగా

నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, రామ్ మోహన్ రావు మాట్లాడుతూ..ఆర్చరీ బేస్డ్ సినిమాలు ఇంత వరకు రాలేదు. ఆ పాయింట్ అందరినీ ఆకట్టుకుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొదట ఈ కథ విన్నప్పుడు కొద్దిగా భయపడ్డాను. కానీ పూర్తిగా కథ విన్నాక చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఆటతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కథ విన్నవెంటనే నాగ శౌర్యకు పంపించాం. అతను విన్న వెంటనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లు, ఓవర్సీస్‌లో 100 థియేటర్లలో లక్ష్య సినిమాను విడుదల చేయబోతోన్నాం. ఆన్ లైన్ టికెటింగ్ అనేది మంచిదే. దానిపై ఎవ్వరికీ ఎలాంటి ఏ ఇబ్బంది లేదు. టికెట్ రేట్లు మరీ ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా రేట్లు ఉంటేనే పరిశ్రమకు మంచిదని మా అభిప్రాయం. అన్నారు.

Related Posts