హీరో కిర‌ణ్‌ అబ్బవరం సోదరుడు మృతి

యువ హీరో కిర‌ణ్‌ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తాజా సమాచారం.. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన రామాంజులు కన్నుమూశారు. అబ్బవరం రామాంజులు రెడ్డి సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తున్నాడు. ఇక కిర‌ణ్‌ అబ్బవరం రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆత‌ర్వాత ఎస్ఆర్ క‌ళ్యాణ మండ‌పం సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించాడు.

సమ్మతమే, సెబాస్టియన్‌ పీసీ 524 అనే చిత్రాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే మరో సినిమాను కూడా ప్రారంభించాడు. అక్ష‌రశిల్పి సిరివెన్నెల చ‌నిపోవ‌డం గురించి కిర‌ణ్ అబ్బ‌వ‌రం స్పందిస్తూ… తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌నిలోటు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆయ‌న కుటుంబంలోనే విషాదం చోటుచేసుకోవ‌డం.. సోద‌రుడిని కోల్పోవ‌డంతో పలువురు సినీ ప్రముఖులు కిరణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Related Posts