బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న పుష్ప

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రాలేదు. అయినా బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్స్ కొల్లగొడుతూ ట్రేడ్ ను ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి సెకండ్ హాఫ్ సినిమా అంతా బోరింగ్ గా ఉందనే టాక్ వచ్చింది. అయితేనేం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. దీంతో కలెక్షన్స్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా కేవలం రెండు రోజుల్లోనే 116కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది పుష్ప ది రైజ్. అలాగే ఓవర్శీస్ లో ఆల్రెడీ ఒన్ మిలియన్ రేంజ్ ను దాటేసింది.
అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చింది. ఫస్ట్ పార్ట్ బాగా ఉన్నా.. సెకండ్ పార్ట్ లాగ్ తో ఇబ్బంది పెట్టిందన్న టాక్ వచ్చింది. అయినా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను సాధిస్తుందంటే ఆశ్చర్యమే. సినిమాలో మెయిన్ హైలెట్స్ గా అల్లు అర్జున్ నటనను చెప్పుకుంటున్నారు. అలాగే సమంత ఐటమ్ సాంగ్ కూడా కలిసొచ్చింది. ఇటు విలన్స్ గా నటించిన అజయ్ ఘోష్, సునిల్ కొత్తగా ఉండటంతో పాటు వారి నటన కూడా మూవీకి హైలెట్ గా నిలిచింది. అనసూయ పాత్రలోని ఫైర్ ఫస్ట్ పార్ట్ లో పెద్దగా కనిపించలేదు కానీ.. సెకండ్ పార్ట్ లో ఉంటుందేమో. ఇప్పటి వరకూ సినిమా చెన్నై వరకూ స్మగ్లింగ్ చేయడం అనే నేపథ్యంతో సాగింది. సెకండ్ పార్ట్ తో పుష్పనే నేరుగా చైనా వరకూ సరుకును చేరవేసేంత ఎదగడం అనే పాయింట్ తో ఉంటుందట. మొత్తంగా నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతోన్న పుష్ప ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరుస్తోంది.

Related Posts