నేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఇందులో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా నటించారు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ సినిమా పై క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ సింగ రాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
ఇదిలా ఉంటే.. ఈ వేడుకలో స్టేజ్ పైనే ఫిదా బ్యూటీ సాయిపల్లవి కంటతడిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరు అరవడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయి పల్లవి ఎమోషనల్ అవుతూ స్టేజ్ పైనే కంట నీరు పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఒక హీరోయిన్ పేరు వినగానే ఫ్యాన్స్ అంతలా అరవడం చాలా అరుదని తెలుస్తోంది.
ఇంతటి అభిమానుల ప్రేమను చూసిన సాయి పల్లవి స్టేజ్ పైనే ఏడ్చేసింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సాయిపల్లవికి ఎంత క్రేజ్ ఉందో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.