2022 సంక్రాంతికి భారీ చిత్రాలు విడుదల అవుతాయి అనుకుంటే.. కరోనా కారణంగా వాయిదా పడడం తెలిసిందే. సంక్రాంతి బరి నుంచి పాన్ ఇండియా చిత్రాలన్నీ తప్పుకోవడంతో నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు మాత్రమే పెద్ద సినిమా కేటగిరీలో విడుదలైంది. ఈ సినిమాతో పాటు డెబ్యూ హీరోలు నటించిన సినిమాలు కూడా విడుదలయ్యాయి.
అయితే.. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, సర్కారు వారి పాట, కేజీఎఫ్ 2 చిత్రాలు వాయిదా పడడంతో ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది ఆసక్తిగా మారింది. ఇంకా చెప్పాలంటే.. ఈ రిలీజ్ డేట్స్ పై కన్ ఫ్యూజన్ ఏర్పడిందని చెప్పచ్చు. దీంతో సోషల్ మీడియాల్లో ఈ సినిమాలన్నిటినీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే దానిపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఇండస్ట్రీ న్యూస్ ఏంటంటే…. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదలవుతుంది. ఆతర్వాత మార్చి 18న రాధేశ్యామ్ విడుదలకు రెడీ అవుతుంది. ఏప్రిల్ 1న ఆచార్య విడుదలవుతుంది. అటుపై ఏప్రిల్ 29న అత్యంత భారీగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలవుతుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇక వీటన్నిటి తర్వాత మే 13న సర్కార్ వారి పాట విడుదలవుతుందని కూడా ఓ వార్త వినిపిస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 వర్సెస్ బీస్ట్ ఫిక్సయిన సంగతి తెలిసిందే. అదే రోజు నాగచైతన్య హిందీ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చద్దా కూడా రిలీజవుతోంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ డేట్స్ లోనే ఈ సినిమాలు వస్తాయా..? మారతాయా..? అనేది క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.