అక్కినేని నాగచైతన్య, సమంత.. ఏమాయ చేశావే సినిమాలో నటించడం.. ఆతర్వాత ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవం తెలిసిందే. టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న చైతు – సామ్ విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఒకరినొకరు కలుసుకోలేదు. అయితే.. విడాకుల గురించి సమంత మాట్లాడింది కానీ.. చైతన్య మాత్రం ఎప్పటిలానే సైలెంట్ గా తన పని తను చేసుకుంటున్నాడు.
వీరిద్దరూ విడిపోయినప్పటికీ.. ఒకే ఫీల్డ్ లో ఉన్నవారు కావడంతో ఏదొక సందర్భంలో ఒకరికొకరు ఎదురు పడాల్సిన పరిస్థితి వస్తుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగా ఇటీవల అలాంటి సందర్భం వచ్చిందట. అయినప్పటికీ.. ఇద్దరూ ఒకరినొకరు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎప్పుడు..? ఎక్కడంటే.. చైతన్య నటిస్తున్న బంగార్రాజు సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగిందట. సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న యశోద చిత్రీకరణ కూడా అదే స్టూడియోలో జరిగిందట. అయితే.. చైతు – సామ్ ఒకరికొకరు ఎదురుపడకుండా చూసుకోవాలని తమ సిబ్బందికి తెలియజేశారట.
వారి ఆదేశాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంతో నాగచైతన్య మరియు సమంత ఇద్దరూ తమ పనులను పూర్తి చేసుకొని.. ఒకరినొకరు చూసుకోకుండానే స్టూడియో నుండి బయలుదేరారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త అలా.. అలా బయటకు వచ్చింది. దీంతో విడిపోయినా ప్రెండ్స్ లా ఉంటామన్నారు కదా..? మరి.. ఇలా ఎందుకు �