పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ చిత్రానికి
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అని గత కొంతకాలంగా ప్రకటిస్తూనే ఉన్నారు.
అయినప్పటికీ.. భీమ్లా నాయక్ వాయిదా పడుతుందని గట్టిగా ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్నట్టుగానే భీమ్లా నాయక్ వాయిదా పడింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. భీమ్లా నాయక్ వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. నిర్మాతలు దిల్ రాజు, దామోదర ప్రసాద్ మాట్లాడుతూ… ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు భారీ స్ధాయిలో రిలీజ్ అవుతున్నాయి. భీమ్లా నాయక్ సంక్రాంతికి రిలీజ్ అయితే.. మూడు సినిమాలు భారీగా నష్టపోతాయి. అందుచేత భీమ్లా నాయక్ ని వాయిదా వేయమని మేము పవన్ కళ్యాణ్ గార్ని అడగడం జరిగింది.
నిర్మాతల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని భీమ్లా నాయక్ ని వాయిదా వేయడానికి ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ గార్కి మనస్పూర్తిగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాం అన్నారు. మరి.. భీమ్లా నాయక్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందంటే.. ఫిబ్రవరి 25న అని సమాచారం. ఫిబ్రవరి 25న సోలోగా వచ్చే భీమ్లా నాయక్ భారీ విజయం సాధించడం ఖాయం. మరి.. ఏ రేంజ్ సక్సస్ సాధిస్తాడో చూడాలి.