హీరోగా అఖండ నిర్మాత బావమరిది ..? దర్శకుడెవరో తెలుసా..?

ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది టైమ్ లోనే అఖండ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. అంతకు ముందు అతను సాహసం శ్వాసగా సాగిపో, జయజానకి నాయక వంటి చిత్రాలు నిర్మించాడు. జయ జానకి తర్వాత కొంత గ్యాప్ వచ్చినా మళ్లీ బోయపాటి శ్రీనుతోనే సినిమా చేయాలనుకున్నాడు. ఇందుకు బాలయ్య తో హ్యాట్రిక్ కూడా సెట్ కావడంతో నిర్మాతకు ఈ ప్రాజెక్ట్ లేట్ అయినా నిర్మాతకు ఊహించని విజయాన్ని అందించింది. మరోవైపు అతని కజిన్స్ కూడా ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. లేటెస్ట్ గా వచ్చిన అతిథిదేవోభవ చిత్రాన్ని నిర్మించింది రవీందర్ రెడ్డి కజిన్సే.
ఇండస్ట్రీ అంటేనే వారసులతో నిండిపోయింది కదా..? కాకపోతే ఇప్పటి వరకూ ఎక్కువగా హీరోల వారసులే రాణిస్తున్నారు. తాజాగా దిల్ రాజు సోదరుడు కొడుకు ఆశిష్ హీరో అయ్యాడు. ఇక తనెందుకు అలాంటి ప్రయత్నం చేయకూడదు అనుకున్నాడేమో.. మిర్యాల రవీందర్ రెడ్డి తన బావమరిదిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు అంటున్నారు. పెద్ద నిర్మాతగా పేరొచ్చింది కాబట్టి డబ్బుకు లోటు లేదు. మరి దర్శకుడు..? అనే ప్రశ్నకు సమాధానం సంపాదించాడు రవీందర్ రెడ్డి.
ఫ్యామిలీ చిత్రాలతో ఎక్కువగా ఆకట్టుకున్న శ్రీకాంత్ అడ్డాలతో తన బావమరిదిని హీరోగా పరిచయం చేయబోతున్నాడట. శ్రీకాంత్ ఆల్రెడీ వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసిన అనుభవం ఉన్నవాడు. పైగా రీసెంట్ గా నారప్ప చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీప్ట్ వరకూ పూర్తయిందనీ.. హీరోయిన్ గానూ ఓ కొత్తమ్మాయినే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారనీ సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది.

Related Posts