చిరంజీవిపై 20 కోట్లు పరువు నష్టం.. మన్సూర్ ఆలీ ఖాన్

నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమిళనాడు నుంచి ఈ వివాదం ఇప్పుడు మెగాస్టార్ కి తాకింది. ఈ ఇష్యూలో త్రిషకి మద్దతుగా మెగాస్టార్ ట్వీట్ చేయడంతో.. మన్సూర్ ఆలీ ఖాన్ ఆయనపై మండిపడుతున్నాడు. గతంలో తాను చిరంజీవితో నటించానని.. అయితే ఆయన ఈ విషయంలో మాట్లాడే ముందు తనని ఒక్కసారి అడిగి ఉంటే సరిపోయేదని తాజా ఇంటర్యూలో తెలిపాడు మన్సూర్ ఆలీ ఖాన్.

చిరంజీవి ప్రతీ ఏడాది పాత హీరోయిన్స్ కి పార్టీ ఇస్తుంటాడని.. దానికి తనను ఎప్పుడూ పిలవలేదని మెగాస్టార్ పై ఈ సందర్భంగా సెటైర్లు వేశాడు. ఈ వివాదంలో త్రిష, ఖుష్బూ లపై చెరొక పదేసి కోట్లు పరువు నష్టం దావా వేస్తానన్న మన్సూర్.. చిరంజీవిపై మాత్రం రూ. 20 కోట్లు పరువు నష్టం దావా వేయబోతున్నట్టు చెప్పాడు. అలా వచ్చిన రూ. 40 కోట్లను తాను తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు అందిస్తానని తెలిపాడు. మరి.. ఈ ఇష్యూ పై మెగాస్టార్ నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో చూడాలి.

Related Posts