నిత్యామీనన్‌ని అప్పుడయితే ఆపేసేవారా?


నేను సినిమాల నుంచి కాస్త్ బ్రేక్‌ తీసుకుంటున్నానహో అంటూ దండోరా వేసి ప్రకటించింది బొద్దుగుమ్మ నిత్యామీనన్‌. ఆ మధ్య ఓ రియాలిటీ షోలో పార్టిసిపేట్‌ చేసిన నిత్య, ఇప్పుడు కాస్త గ్యాప్‌ తీసుకుంది. మామూలుగా నటీనటులు ఎవరైనా గ్యాప్‌ తీసుకుంటారు. కాకపోతే మన దగ్గర అలాంటి అలవాటు లేదు కాబట్టి నేను ఏమైనా చెప్తే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అంటూ తన గ్యాప్‌ని సమర్థించుకుంది నిత్య.

అంతే కాదు తనకు సినిమా ప్రాణం కాదని, తనకు ఎక్స్ టెన్షన్‌గా మాత్రమే సినిమాను చూస్తానని చెప్పింది. ఓకే బంగారం సినిమాలో తాను చేసిన కేరక్టర్‌ నేచురల్‌గా ఉంటుందని, రియల్‌ లైఫ్‌లో తాను అలా ఉండటం వల్లనే అది సాధ్యమైందని చెప్పింది నిత్య. అయితే రీసెంట్‌గా ధనుష్‌ మూవీలో చేసిన పాత్ర, అంతకు ముందు కాంచన లాంటివి తనకు అంత తేలిగ్గా అర్థం కావని, వాటి గురించి మనసులో కొన్నిసార్లు అనుకుంటానని చెప్పింది.


రీసెంట్‌గా రియాలిటీ షోలో పాల్గొనడం గురించి ఎగ్జయిట్‌ అయింది నిత్య… ”ఇప్పటిదాకా నేనేంటో సినిమాల్లోనే చూశారు. సినిమాల్లో కేరక్టర్లు నా వ్యక్తిత్వాన్ని ప్రజలకు పరిచయం చేయలేవు. కానీ, రియాలిటీ షోల ద్వారా నేను స్పాంటానియస్‌గా ఎలా స్పందిస్తాను. అసలు నా తీరు ఎలా ఉంటుందో జనాలు బాగా అర్థం చేసుకున్నారు. రియల్‌ నిత్యను చూశాం అని వారు అంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకిప్పుడు కొత్త సెట్‌ ఆఫ్‌ ఆడియన్స్ వచ్చారు. నెక్స్ట్ నేనేం చేసినా వీళ్లందరి కూడా దృష్టిలో పెట్టుకుంటాను” అని ఓపెన్‌ అయింది నిత్యామీనన్‌. ప్రొడ్యూసర్‌గా ఇటీవల చేసిన స్కైల్యాబ్‌ తనకు మంచి అనుభవాన్నిచ్చిందని తెలిపింది నిత్య. పదేళ్ల ముందయితే అమ్మాయిలు ఇంత ఫ్రీగా ప్రొడ్యూస్‌ చేయగలిగేవారా అనేది అనుమానమే అని అంటోంది ఈ బ్యూటీ.

Related Posts