ప‌వ‌న్ తో రాజ‌మౌళి భేటీ ఏమైంది..?

సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ రావ‌డం ప‌క్కా. ఈ రెండు సినిమాల‌తో పాటు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కూడా విడుద‌ల‌కు రెడీ అవుతుంది. అయితే.. పవర్ స్టార్ భీమ్లా నాయ‌క్ మూవీ రిలీజ్ అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాకి భారీగా న‌ష్టం వ‌స్తుంద‌ని… అందుచేత‌ జక్కన్న రంగంలోకి దిగి పవన్ ని రెక్వస్ట్ చేస్తారని.. భీమ్లా నాయక్ రిలీజ్ తేదీ వాయిదా పడుతుందని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌చ్చాయి.

ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త వాస్త‌వ‌మేనా..? కాదా..? అన్న‌ది ఆరా తీస్తే.. రాజమౌళి ఇంకా పవన్ కళ్యాణ్ ని క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేయలేద‌ని తెలిసింది. దీంతో భీమ్లా నాయక్ నిర్మాతలు జనవరి 12 న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పంపిణీదారులు బయ్యర్లకు ఇదే సమాచారం అందింది. మరో వైపు భీమ్లా నాయక్ నుంచి నాలుగో పాట అడవి తల్లి మాట.. డిసెంబర్ 1న విడుదల చేయాలి అనుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో పాటల విడుదల వాయిదా పడింది.
భీమ్లా నాయక్ ప్ర‌మోష‌న్స్ లో దూసుకెళుతుంది. మ‌రో వైపు.. భీమ్లా నాయ‌క్ రిలీజ్ వాయిదా విష‌య‌మై రాజ‌మౌళిని క‌ల‌వ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

Related Posts