ఎమ్ఎస్ రాజుకు ఏమైంది..?

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ .. ఈ బ్యానర్ పేరు చెబితే తెలుగులో ఒకప్పుడు గౌరవప్రదమైన నిర్మాణ సంస్థగా ప్రతి ఒక్కరూ చూశారు. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ ను చేసిందీ.. మహేష్ బాబుకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది.. ఉదయ్ కిరణ్ ను లవర్ బాయ్ ని చేసిందీ.. ప్రభాస్ కు ఫస్ట్ బ్లాక బస్టర్ ఇచ్చిందీ ఆ బ్యానరే. శ్రీహరిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలబెట్టి.. కొరియోగ్రాఫర్ ప్రభుదేవను దర్శకుడిని చేసిందీ ఈ బ్యానరే. అన్నిటికీ మించి అమ్మోరు తర్వాత ఎవరూ ధైర్యం చేయకపోతే దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గ్రాఫికలవ్ వండర్ ను చూపించి ఇప్పుడు రాక్ స్టార్ అని చెప్పుకుంటోన్న దేవీ శ్రీ ప్రసాద్ ను టీనేజ్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసిందీ ఈ బ్యానర్ అధినేత ఎమ్మెస్ రాజు. అలాంటి నిర్మాతకు ఇప్పుడు ఏమైందీ..? అంటే సమాధానం అంత కష్టమేం కాదు. పౌర్ణమి తర్వాత అతని బ్యానర్ కు అమావాస్య పట్టుకుంది. అయినా నిలదొక్కుకోవచ్చు. కానీ అతి విశ్వాసంతో ఎమ్మెస్ రాజు ఆడిన ఒక్క ‘ఆట’ సినిమా అతని జీవితంతో ఆడేసుకుంది. యస్.. అతను ఆట అనే సినిమాతోనే ఎటూ కాకుండా పోయాడు. ఇది అతను కూడా ఒప్పుకుని తీరే సత్యం.