టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. బంగార్రాజు, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, ఆచార్య… ఇలా భారీ సినమాలన్నీ మల్టీస్టారర్ సినిమాలే. ముఖ్యంగా నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్.. ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి ఎవరూ ఊహించలేదు. అలాంటి కాంబినేషన్ సెట్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. దీంతో ఇప్పుడు మరెన్ని మల్టీస్టారర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో భారీ మల్టీస్టారర్ గురించి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ భారీ మల్టీస్టారర్ లో ఎవరెవరు నటించనున్నారంటే.. నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో ఉంటుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల ఆహా కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేయడం.. దీనికి అనూహ్యమైన స్పందన రావడం తెలిసిందే. అలాగే బాలయ్య అఖండ ప్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు.
ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య మధ్య మంచి అనుబంధం ఉంది. ఆతర్వాత వాళ్ల వారసులు బాలయ్య, అల్లు అరవింద్ మధ్య కూడా అదే అనుబంధం కంటిన్యూ అయ్యింది. అందుకనే అల్లు అరవింద్ అడగగానే బాలయ్య ఆహా కోసం టాక్ షో చేయడానికి ఓకే చెప్పారు. అందుచేత బాలయ్య, బన్నీ కాంబినేషన్లో మూవీ రావడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే.. దీనికి దర్శకుడు ఎవరు..? ఎవరు నిర్మిస్తారు..? అనేది బయటకు రాలేదు.