స‌ర్కారు వారి పాట లేటెస్ట్ అప్ డేట్

సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు, గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌ర్కారు వారి పాట‌. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న కేర‌ళ కుట్టి కీర్తి సురేష్ న‌టిస్తుంది. సంక్రాంతికి ఈ సినిమా రావాలి అనుకున్న‌ది అయితే… ఆర్ఆర్ఆర్ కోసం వాయిదా ప‌డింది. ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఇటీవ‌ల మ‌హేష్ మోకాలికి స‌ర్జ‌రీ జ‌ర‌గ‌డంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఆత‌ర్వాత మ‌హేష్ కి క‌రోనా రావ‌డం.. అలాగే మ‌హేష్ బ్ర‌ద‌ర్ ర‌మేష్ బాబు చ‌నిపోవ‌డంతో స‌ర్కారు వారి పాట ఇప్ప‌ట్లో తాజా షెడ్యూల్ స్టార్ట్ కాదు అనుకున్నారు. అయితే.. మహేష్‌ లేని సన్నివేశాలను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వైజాగ్ బీచ్ రోడ్, జగదాంబ సెంటర్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే మేకర్స్ ఈ ఏడాది ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అందుకే ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్ సంస్థలు కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Related Posts