మా అన్నను టార్గెట్ చేశాడు.. మెగా బ్రదర్స్ పై మంచు మనోజ్ సెటైర్లు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. అది ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణులా కాకుండా.. మెగా వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది. మా ఎన్నికలు కాస్త ఇండస్ట్రీ పెద్దరికం వైపుగా నడిచింది. చిరంజీవి తనను పోటీ నుంచి తప్పుకోమన్నాడు అని మంచు విష్ణు మీడియా ముఖంగా చెప్పేశాడు.

మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇవ్వడం, ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నిలబడటం అందరికీ తెలిసిందే. మంచు వారి తరుపున నరేష్ రంగంలోకి దిగి చక్రం తిప్పడం తెలిసిందే. మా ఎన్నికలు జరిగిన ఆ సమయంలో మెగా వర్సెస్ మంచు అన్నట్టుగానే వ్యవహారం సాగింది. ఇక నాగబాబు చేసిన కొన్ని కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్.. తెలుగు నాన్ తెలుగు అనే వ్యవహారాలు వచ్చాయి. కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ.. మంచు విష్ణుకి తన మద్దతును ప్రకటించాడు. అయితే ఈ విషయంపై నాగబాబు మాట్లాడిన మాటలు ట్రోలింగ్‌కు గురయ్యాయి.

అలా మొత్తానికి మంచు ప్యానెల్ చేసిన వ్యాఖ్యలు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ చేసిన వ్యాఖ్యలు కూడా నెట్టింట్లో దారుణమైన ట్రోలింగ్‌ను చవిచూశాయి. చివరకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యాడు. ఆ తరువాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా కూడా రాజీనామ చేసేశారు. వాటిని చివరకు మంచు విష్ణు అంగీకరించాడు.

అయితే ఇప్పుడు మళ్లీ మా ఎన్నికల వ్యవహారం తెర మీదకు వచ్చింది. దానికి కారణం మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలే. మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలను శ్రీవిద్యానికేతన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మంచు మనోజ్ పరోక్షంగా కొన్ని సెటైర్లు వేశాడు. హయ్యర్ పర్పస్ అంటూ విద్యానికేతన్ విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చాడు.

‘హయ్యర్ పర్పస్ లేని వ్యక్తులకు ఏం చేయాలో తోచదు.. ఎప్పుడూ పక్క వారి మీద పడుతుంటారు.. వారికంటూ ఓ లక్ష్యం, గమ్యం ఉండదని చెప్పుకొచ్చాడు. ఉదాహరణగా మా ఎన్నికల గురించి మాట్లాడాడు. పోటీ అంటే రెండు పక్కలుంటాయి. ఒకరిద్దరు ఉంటారు.. ఇటు పక్క వెళ్లి ఓట్లు వేయమని అడిగారు.. అటుపక్క ఓట్లు వేయమని అడిగారు. పలాన వ్యక్తి గెలిస్తే బాగుంటుందని జనాలందరూ అనుకున్నారు.. మా అన్నను గెలిపించారు..
వాళ్ల ఫ్యామిలీలో ఇతనొక్కడికే ఏం లేదు..

అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇండస్ట్రీ అందరూ ఫ్రెండ్సే. ఎవరికి ఎవరం హానీ చేసుకోం. కానీ ఒక వ్యక్తి మాత్రం మా అన్నని టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడదామని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. కానీ మా అన్న పట్టించుకోలేదు.. నాన్న గారూ పట్టించుకోలేదు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎన్నికలు అయిపోయాయ్. రిజల్ట్ వచ్చింది. మాకు సపోర్ట్ చేసిన వాళ్లని పెద్ద పెద్ద వాళ్లని కూడా బూతులు తిట్టాడు. అది మీ అందరూ చూశారు. వాళ్లెందుకు అలా చేశారని ఆలోచించాను. వాళ్లకు హయ్యర్ పర్పస్ లేదు వదిలేయ్ పాపం అని నాన్న గారు అన్నారు. కరెక్టే కదా? అని అనిపించింది.

తరువాత నేను ఆయన గురించి ఆలోచించాను. అతని చుట్టూ గొప్పగొప్ప వాళ్లున్నారు. హయ్యర్ పర్పస్ కోసం జీవించేవాళ్లున్నారు. జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్నవాళ్లున్నారు వాళ్ల ఫ్యామిలీలో.. కానీ ఆయనకు మాత్రం ఏదీ లేకుండా ఉండిపోయారు’ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు.

Related Posts