బాలీవుడ్ లో అడుగుపెడుతోన్న గూఢచారి

టాలెంటెడ్ అనిపించుకున్నా.. ఆ ప్రతిభకు తగ్గ గుర్తింపు రావడానికి చాలా టైమ్ పట్టిన స్టార్ అడవి శేష్. స్వయంకృషితోనే తనూ హీరోగా నిలబడ్డాడు. పైగా కొత్త జానర్స్ తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ తనదైన రూట్ లో దూసుకుపోతున్నాడు. హీరోగా చేయకముందు పంజా, బాహుబలి వంటి సినిమాల్లో విలన్ గానూ మెప్పించిన శేష్.. ప్రస్తుతం 26/11 టైమ్ లో ముంబైలోని తాజ్ హోటెల్ లో ఉగ్రమూక జరిపిన దాడిలో అమరుడైనా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ ‘మేజర్’లో నటిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తనే స్క్రిప్ట్ సమకూర్చాడు. గూఢచారి సినిమా దర్శకుడు శశికిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ మేజర్ 2022 ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది.
ప్రస్తుతం ఈ సినిమా కోసం ఎక్కువగా ముంబైలోనే ఉంటోన్న శేష్ లేటెస్ట్ గా ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తను రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడట. ఈ రెండు ప్రాజెక్ట్స్ ను కూడా అక్కడ పేరున్న ప్రొడక్షన్ హౌసెస్ నిర్మించబోతున్నాయని సమాచారం. అలాగే అక్కడ సినిమాలు చేసినా స్క్రిప్ట్ విషయంలో తన హ్యాండ్ కూడా ఉంటుందని చెబుతున్నారు. బాలీవుడ్ లో రెండు సినిమాలు వరుసగా చేయడం అంటే మేజర్ తో కలిపి హ్యాట్రిక్ మూవీస్ అవుతాయి. మేజర్ పై అన్ని భాషల్లోనూ అంచనాలున్నాయి. ఇలాంటి చిత్రాలను శేష్ బాగా రాస్తాడు.. అతని ఫ్రెండ్ శశికిరణ్ బాగా తీస్తాడు కూడా. అందుకే మేజర్ విజయం గ్యారెంటీ అంటున్నారు. మొత్తంగా ఆ తర్వాత చేసే సినిమాలు కూడా విజయం సాధిస్తే.. బాలీవుడ్ లోనూ శేష్ తనదైన ముద్రను బలంగా వేసే అవకాశం ఉంటుంది. మరోవైపు గూఢచారికి కూడా సీక్వెల్ చేయబోతున్నారు కదా.. ఏదేమైనా పర్టిక్యులర్ ఇమేజ్ వస్తుందన్న భయం లేకుండా ఒకే తరహా చిత్రాలతో వరుస విజయాలు �