Ram pothineni : రామ్ – పూరీ.. డబుల్ ఇస్మార్ట్ ..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఆ టైమ్ లో మాగ్జిమం క్లాస్ సినిమాలే ఎక్కువగా వస్తుండటంతో సడెన్ గా వచ్చిన ఈ మాస్ మూవీకి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. రామ్ ఫస్ట్ టైమ్ తెలంగాణ స్లాంగ్ లో చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. నిధి అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది.

అప్పట్లో ఏ అంనాలూ లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు. సీక్వెల్ కు టైటిల్ గా “డబుల్ ఇస్మార్ట్” అని పెట్టారు. ఫస్ట్ పార్ట్ లో బ్రెయిన్ లో చిప్ ను అమర్చడం అనే ఇల్లాజికల్ పాయింట్ తోనే మెప్పించాడు పూరీ. ఇప్పుడు కొత్తగా అమర్చిన చిప్ తో ఆవారా అయిన శంకర్ పోలీస్ అవుతాడు. మామూలుగా ఈ సీక్వెల్ కు లైన్ ఇదే అవుతుంది.


ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు పూర్తి కావొచ్చింది.

త్వరలోనే పూరీతో మూవీ సెట్స్ పైకి వెళుతుంది. మామూలుగా పూరీ జగన్నాథ్ సినిమాలంటే జెట్ స్పీడ్ తో షూటింగ్ అయిపోతుంది కదా..? అందుకే ఇంకా ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కాని ఈ చిత్ర రిలీజ్ డేట్ తో సహా అనౌన్స్ చేశాడు దర్శకుడు. 2024 మార్చి 8న ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని ప్రకటించాడు. ఇది కాస్త అతిగా అనిపించినా.. పూరీ స్పీడ్ కు ఆ డేట్ చాలా ఎక్కువనే చెప్పాలి.


ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ ఇద్దరికీ ఇప్పటి వరకూ సరైన హిట్ పడలేదు. పూరీ జగన్నాథ్ భారీ అంచనాలు పెంచి చేసిన లైగర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిస్తే.. ఇప్పటి వరకూ ఆ చిత్ర అప్పులే తీరలేదు.

ఇటు రామ్ కూడా రెడ్, వారియర్ మూవీస్ తో వచ్చాడు. ఈ రెండూ పోయాయి. ఇక బోయపాటి మూవీపై హోప్స్ పెట్టుకున్నాడు. ఇదీ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే వస్తోంది. మరి ఈ డబుల్ ఇస్మార్ట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.

Related Posts