జస్ట్ ఆర్టినర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపార్తి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు గుణ బాల సుబ్రమణియమ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కామెడీ, డ్రామా జోనర్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను అనసూయ భరద్వాజ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ..
పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.. మరో మంచి చిత్రం మాయాపేటికతో నేను మళ్లీ ఈ స్టేజ్ మీదకు వచ్చాను.. అభిమానుల ప్రేమ, సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వారి ప్రేమ మాత్రం ఎప్పుడూ మారడం లేదు. మీ ప్రేమను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. ఇలాంటి సినిమా చేయాలంటో ఎంతో రీసెర్చ్ చేయాలి. ఇలాంటి కారెక్టర్, సినిమా అ