ఎంతగానో ఎక్స్ పెక్ట్ చేసిన రాధేశ్యామ్ అస్సాం పోయింది. అంతకు ముందు చేసిన సాహో కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. అందుకే ప్రభాస్ దృష్టి మొత్తం ఇప్పుడు ఆదిపురుష్ మీదే ఉంది. బాహుబలి తెచ్చిపెట్టిన క్రేజ్ని ఆదిపురుష్తో మళ్లీ సంపాదించుకోవాలనే తపనతో ఉన్నాడు ప్రభాస్.
ఓం రవుత్ డైరక్ట్ చేసిన సినిమా ఆదిపురుష్. సీతగా కృతిసనన్ నటించింది. లంకేశ్వరుడిగా సైఫ్ నటించాడు. ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈసినిమా షూటింగ్ పూర్తయింది కాబట్టి ఇప్పుడు ప్రాజెక్ట్ కె, సలార్ షూటింగులతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఆదిపురుష్ ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంది? అనేది ఇప్పుడు చాలా పెద్ద డిస్కషన్. 9500 స్క్రీన్లలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. వాటిలో ఆరున్నర వేలు సింగిల్ స్క్రీన్లే ఉన్నాయి. మిగిలినవి మల్టీప్లెక్సులు. కొన్ని థియేటర్లలో నాలుగు షోలు, మరికొన్ని థియేటర్లలో ఐదు షోలకు పర్మిషన్ ఉంటుంది. ఈ లెక్కన ఆదిపురుష్కి తొలిరోజు 35వేలకు పైగా షోలు పడతాయి. ఏమాత్రం పాజిటివ్ బజ్ ఉన్నా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వందల కోట్లు వచ్చేస్తాయి.
రామాయణకథను ఇంటిల్లిపాదీ కలిసి చూడాలనుకుంటారు కాబట్టి, పైగా పిల్లలకు చూపించాలనుకుంటారు కాబట్టి ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్లో సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే శుభసూచికాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నార్త్ క్రిటిక్స్. ఆల్రెడీ కాశ్మీర్ఫైల్స్, కార్తికేయ2 సినిమాలకు నార్త్ లో వస్తున్న ఆదరణ చూస్తే, ప్రభాస్ ఆదిపురుష్కి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయన్నది వారి మాట.సో ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాల మార్కెట్కూ, బిజినెస్కూ ఆదిపురుష్ మార్గం సుగమం చేస్తుందనే అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.