‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో నటుడు సముద్రఖని

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో భాగంగా దర్శకుడు ఎం.శశికుమార్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన ‘పాన్ ఇండియా నటుడు సముద్రఖని’ ఈరోజు హైటెక్ సిటీ లోని శిల్పారామంలో రావి మొక్కను నాటారు.

ఈ సందర్భంగా నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు. ప్రకృతి పచ్చగా ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ను గొప్ప సామాజిక ఉద్యమంగానే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగానూ తీర్చిదిద్దిన అధినేత జోగినపల్లి సంతోష్ కుమార్ గారు మరియు నిర్వాహకుల నిరంతర కృషి ఎంతో ప్రశంసనీయం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను నా ఇంటి నుంచే మొదలు పెడుతున్నాను.

ఈ బృహత్తర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నా కుమారుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీ మరియు ప్రముఖ దర్శకులు హెచ్.వినోత్ లకు సినీ నటుడు సముద్రఖని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ను విసిరాడు.

Related Posts