చిరు ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి గెస్ట్ గా ఎన్టీఆర్.?

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం అఖండ‌. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రావడం తెలిసిందే. నంద‌మూరి బాల‌కృష్ణ‌, అల్లు అర్జున్ ఓకే వేదిక పై క‌నిపించ‌డం.. ముఖ్యంగా అల్లు అర్జున్ జై బాల‌య్య అన‌డం అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు బాల‌య్య అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డ్డారు. దీంతో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లెక్క‌లే మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే… ఇక నుంచి ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్స్ కి కొత్త కాంబోల‌తో అభిమానుల‌ను అల‌రించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

బన్నీ మూవీ పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బాలయ్య గెస్ట్ గా వస్తాడు అన్న టాక్ ఇపుడు హాట్ హాట్ గా మారింది. అఖండ ఫంక్ష‌న్ కి బ‌న్నీ వ‌చ్చినందుకు గాను.. పుష్ప ఫంక్ష‌న్ కి బాల‌య్య వెళ్లాలి అనుకుంటున్నార‌ట‌. అల్లు ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో చీఫ్ గెస్ట్ బాలయ్య అయితే.. ఆ సందడే వేరే లెవెల్ అంటున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ఆచార్య‌.

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వ‌ర‌లో గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ద‌గ్గ‌ర నుంచి చ‌ర‌ణ్‌, తార‌క్ మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. అన్నదమ్ములుగా మారిపోయారు. దాంతో రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీకి జూనియర్ రావడం అంటే విశేషం ఏమీ కాదు కానీ.. అక్కడ మెగాస్టార్ కూడా ఉంటారు కాబట్టి ఈ కలయిక ఓ సంచ‌ల‌నం అని చెప్ప‌చ్చు.

Related Posts