మాస్ రాజా రవితేజ ఈగల్ అవతారం..

మాస్ మహరాజ్ రవితేజ దూకుడుకు టాలీవుడ్ సైతం షేక్ అవుతోంది. ఒకటి తర్వాత ఒకటి అంటూ వరుసగా జెడ్ స్పీడ్ తో సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. అవీ అంతే స్పీడ్ గా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయినా అతను ఆగడం లేదు. ఇప్పటికే మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ఖిలాడీ స్టార్ లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అన్ని చిత్రాల్లా ఇది కూడా అనౌన్స్ మెంట్ సౌండ్ లో సాలిడ్ అనిపించుకుంటోంది.

క్రాక్ హిట్ తర్వాత వరుసగా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ అంటూ రెండు డిజాస్టర్స్ చూశాడు రవితేజ. ఇవి ప్రొడక్షన్ లో ఉన్న టైమ్ లోనే మరో మూడు సినిమాలకు సైన్ చేశాడు. అందులో మొదటిది ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. అటుపై టైగర్ నాగేశ్వరరావు అంటూ స్టూవర్ట్ పురంకు చెందిన వ్యక్తి బయోపిక్ లాంటి సినిమాకు ఓకే చెప్పాడు. మరోవైపు రావణాసుర అనే సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలూ ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అన్నీ కుదిరితే ఈ యేడాదే రెండు సినిమాలు విడుదలవుతాయి. దీంతో ఆల్రెడీ మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు మాస్ రాజా..

సినిమాటోగ్రాఫర్ గా మంచి