పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుంటే.. రానా దగ్గుబాటి సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్సాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.
అది ఏంటంటే.. ఈ సినిమాకి సంబంధించిన మోస్ట్ అవైటెడ్ టీజర్ అండ్ ట్రైలర్ కట్ వర్క్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యిందట. సరైన టైమ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. డిసెంబర్ 14న రానా దగ్గుబాటి పుట్టినరోజు. ఈరోజున సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే.. టీజర్ రిలీజ్ చేస్తారా..? లేక సాంగ్ రిలీజ్ చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి డిసెంబర్ 14న భీమ్లా నాయక్ నుంచి ఇంట్రస్టింగ్ అప్ డేట్ రావడం మాత్రం ఖాయం.