“జెట్టి”ఈ నెల 28న గ్రాండ్ రిలీజ్





నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “జెట్టి”. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహిస్తున్నారు. చివరి దశ సన్నాహాల్లో ఉన్న ఈ సినిమా ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా

హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ…విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి అమ్మాయిగా నటించాలి అనేది నా కోరిక. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా గురించి చెబితే అర్థం కాదు. తెరపై చూసి అనుభూతి చెందాల్సిందే. చీరాల ప్రాంతాన్ని మా చిత్రంలో సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత వేణు గారు సినిమా ప్రారంభం నుంచీ చివరి దాకా ఒకటే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. జెట్టితో మంచి విజయం సాధిస్తామనే నమ్మకం మా అందరిలో ఉంది. అని చెప్పింది.

దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ…ఈ సినిమా రూపొందించే అవకాశం ఇచ్చిన నిర్మాత వేణు మాధవ్ కె గారికి థాంక్స్. సినిమా మేకింగ్ లో �