జాతిరత్నాలు దర్శకుడి సినిమా మొదలవుతోంది

జాతిరత్నాుల.. 2021లో యేడాది విడుదలైన హిలేరియస్ ఎంటర్టైనర్. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా ఓ రేంజ్ లో ఆడేసింది. కోట్లు కలెక్ట్ చేసింది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి ప్రాపర్ స్టోరీ లైన్ ఉండదు. ఏదో అలా వరుసగా సన్నివేశాలు వెళ్లిపోతుంటాయి. కోర్ట్ హాల్ లో కొన్ని సినిమాలపై సెటైర్స్ పడినా.. ఓవరాల్ గా కథ లేకుండానే కథనంతో మాయ చేసిన ఈ టీమ్ కు ఎంటైర్ తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా దర్శకుడు అనుదీప్ ఇంటర్వ్యూస్ తోపాటు టివి షోస్ లో చేసిన హడావిడీ మామూలుగా లేదు. ఈ ప్రమోషన్స్ చూసిన తర్వాత చాలామంది ఆ దర్శకుడికి అభిమానులూ అయిపోయారంటే అతని కామెడీ టైమింగ్ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అలాంటి అనుదీప్ ఈ సారి ఏకంగా బై లింగ్వుల్ ప్రాజెక్ట్ పట్టేశాడు. ఈ మేటర్ గతంలోనే చెప్పినా.. ఫైనల్ గా సినిమా పట్టాలెక్కబోతోంది.
ఏసియన్ గ్రూప్ తో పాటు సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో తమిళ్ నేచురల్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంతో శివకార్తికేయన్ డైరెక్ట్ తెలుగు సినిమా పరిశ్రమకు వస్తున్నాడు. అఫ్ కోర్స్ తమిళ్ లోనూ విడుదలవుతుంది. మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీకి తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని తమన్ స్వయంగా ట్వీట్ చేశాడు. మొత్తంగా శివకార్తికేయన్ 20వ చిత్రంగా వస్తోన్న ఈ మూవీతో అనుదీప్ టైమింగ్ కోలీవుడ్ కు కూడా వెళుతుందన్నమాట.
జాతిరత్నాలు కంటే ముందు అనుదీప్ పిట్టగోడ అనే సినిమా చేశాడు. బట్ ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అతని గురించి కూడా ఎవరికీ తెలియలేదు. కానీ జాతిరత్నాలుతో ప్రభాస్ తో ట్రైలర్ విడుదల చేయించి ఏకంగా దేశంలోనూ కొందరి అటెన్షన్ ను డ్రా చేశాడు. ఇక శివకార్తికేయన్ సినిమాలంటే మంచి కథలు ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. మరి అనుదీప్ అతన్ని ఎలాంటి కథతో ఒప్పించాడో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోందట.

Related Posts