నయీం ఇష్యూస్ తో నాకే సంబంధం లేదు – హీరో వశిష్ట సింహా

కేజీఎఫ్, నారప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు వశిష్ట సింహా. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా నయీం డైరీస్. ఈ నెల 10న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా వశిష్ట సింహా చెప్పిన మూవీ డీటెయిల్స్ చూస్తే..

– నయీం కథ విన్నప్పుడు మనిషి ఇంత క్రూరంగా ఉంటాడా అనిపించింది. జీవితంలో ఎన్నో సాధిస్తాం. ఎంతో సంపాదిస్తాం. కానీ ఒక ఘటన ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది తర్వాత భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. నయీం అనే మనిషి త్వరగా, గట్టిగా రియాక్ట్ అవుతాడు. తర్వాత ఏంటనేది ఆలోచించడు. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఒక గ్యాంగ్ స్టర్ గా ఎదగడం సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. నారప్ప, కేజీఎఫ్ తర్వాత నయీం డైరీస్ సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. నయీం క్యారెక్టర్ లో ఉన్న డెప్త్, ఇంటర్నల్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఇలాంటి పాత్రలు తరుచూ దొరకవు. ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంటుంది.

– నయీం ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని అన్నప్పుడు కాంట్రవర్సీ వస్తుంది. ఇలాంటి సినిమాలో ఎందుకు నటించావు అనే ప్రశ్నలూ వస్తాయి. కానీ నేనొక నటుడిని. నయీంకు సంబంధించిన ఏ విషయాలతో నాకు సంబంధం లేదు. నయీంను ఈ సినిమాలో మంచిగా చూపించే ప్రయత్నం చేయలేదు. అతని జీవితం ఎలా సాగిందో, అలాగే ఒక అద్దంలా తెరకెక్కించాం. నాణేనికి రెండో వైపు ఉన్నట్లు …నయీం కొందరికి హీరో అంటే ఆశ్చర్యం కలుగుతుంది.

నా తదుపరి రిలీజ్ ఓదెల రైల్వే స్టేషన్ సంపత్ నంది గారి డైరెక్షన్ లో చేశాను. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆయన నెక్ట్ మూవీ సింబాలోనూ నటిస్తున్నాను. కేజీఎఫ్ 2 లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను.

Related Posts