మరో వివాదంలో హీరో సిద్ధార్థ్

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. భారత షట్లర్, ఒలంపిక్ మెడల్ విన్నర్ సైనా నెహ్వాల్ ను ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ట్విట్టర్ లో సిద్ధార్థ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ లో భారత ప్రధానికి ఎదురైన చేదు అనుభవం మీద సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. భారత ప్రధానికే భద్రత లేనప్పుడు, ఆయన రక్షణకే మనం రాజీ పడినప్పుడు మనమంతా భద్రంగా ఉన్నామని అనుకోలేం. అరాచకవాదుల చర్యను ఖండిస్తున్నా. మోదీకి మద్ధతుగా నిలుస్తున్నా అని సైనా ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు రీట్వీట్ చేసిన సిద్ధార్థ్ సైనాను సటిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ ద వరల్డ్ థాంక్ గాడ్ మాకు ప్రొటెక్టర్స్ ఉన్నారు అని పేర్కొన్నారు. ఇందులో ఉపయోగించిన భాష, పదాలు వివాదాస్పదం అవుతున్నాయి. సిద్దార్థ్ చేసిన ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ ట్వీట్ మీద గాయని చిన్మయి మండిపడ్డారు. నువ్ హద్దులు దాటేశావ్ సిద్దార్థ్.. ఇది చాలా తప్పు.. అని చెప్పుకొచ్చారు.

జాతీయ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగి సిద్ధార్థ్ మీద విచారణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి తీవ్రత గమనించిన సిద్ధార్థ్ కాస్త వెనక్కి తగ్గారు. కాక్ అండ్ బుల్ అని చెప్పే ఉద్ధేశంలో కాక్ అనే పదాన్ని తన ట్వీట్ లో ఉపయోగించానని, అందులో ద్వందార్థాలు, చెడు పదాల కోసం కాక్ అనే మాటను వాడలేదని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం ఎటువైపు తిరుగుతుందో చూడాలి.

Related Posts