సాయి స్ర‌వంతి మూవీస్‌ నెం.2  చిత్రం ఓపెనింగ్

కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్ ప్రొడక్షన్ నెం. 2 శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. అంజీ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో దండమూడి అవనింద్ర కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత దండమూడి అవనింద్ర కుమార్ క్లాప్ కొట్టారు. ప్ర‌ముఖ సింగ‌ర్ మ‌నో కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆకాష్ పూరి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత భాస్క‌ర భ‌ట్ల స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా..

దండమూడి బాక్సాఫీస్ బ్యాన‌ర్ అధినేత ..నిర్మాత దండ‌మూరి అర‌వింద్ కుమార్ మాట్లాడుతూ ‘‘ దండ‌మూడి బాక్సాఫీస్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమాను ప్రారంభించాం. ఈ సినిమాను హైద‌రాబాద్‌, బ్యాంకాక్, పుకెట్ స‌హా ప‌లు ప్రాంతాల్లో చిత్రీక‌రించ‌టానికి స‌న్నాహాలు చేశాం. 35-40 రోజుల్లో మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాల‌నేది మా ప్లాన్‌. అంద‌రూ మా యూనిట్‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు.

సాయి స్ర‌వంతి మూవీస్ అధినేత ..ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ ‘‘మా సినిమా ఈరోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. సినిమాను హైద‌రాబాద్, బ్యాంకాక్‌, పుకెట్ ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీక‌రించేలా స‌న్నాహాలు చే�