Ustaad : ”ఉస్తాద్” నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్

కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి, కావ్య కళ్యాణ్‌ రామ్ జంటగా రూపొందుతోన్న సినిమా ”ఉస్తాద్”. వైవిధ్యమైన కథతో వస్తున్నట్టుగా ఈ మూవీ గురించి ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అకీవా బి మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి విడుదల చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ కు ఏఆర్ రెహ్మాన్ ఆల్ ది బెస్ట్ చెప్పడం విశేషం. అనంత శ్రీరామ్ రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి పాడారు.

ఇక పాట ఆరంభానికి ముందు వచ్చిన చిన్న సీన్ చాలా అందంగా ఉంది. అంతకు ముందే హీరోయిన్ తన ప్రేమను వ్యక్తం చేసినట్టుగా.. ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉందని హీరో చెబుతూ ఖచ్చితంగా ఇవాళ రోజూ ఉన్నట్టుగా లేదు అని చెప్పిన తర్వాత పాట మొదలైంది.”రోజూ నడిచిన చోటే ఈ రోజేం జరిగినదో.. రోజూ పలికిన భాషే ఈ రోజేం తెలిపినదో.. రోజూ తాకిన చెయ్యే గాని ఈరోజేం చేసిందో.. రోజూ చూసే చూపే గానీ ఈ రోజేం చూపిందో అంటూ మొదలైన పాటలో రెండూ దేహాలై కనిపించే ప్రాణమిదేనా.. మునుగుతున్న ప్రేమలలోనా దారే గోదారై పొంగేనా..” అంటూ సాగే సాహిత్యం ఆకట్టుకుంటోంది.


ఇక సంగీత దర్శకుడు అకీవా ఈ చిత్రంతోనే తెలుగులోకి పరిచయం అవుతున్నాడు. ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేశాడని చెప్పాలి. మామూలుగా ఇలాంటివి మాంటేజ్ సాంగ్స్ లా కనిపిస్తుంటాయి. ఇలాంటి అందమైన ట్యూన్ కు అంతే అంతమైన సన్నివేశాలు రాసుకుంటే ఖచ్చితంగా సినిమాలోనే పాట హైలెట్ అవుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఉస్తాద్ అనే టైటిల్ చాలా పవర్ ఫుల్.

ఇలాంటి టైటిల్ తో శ్రీ సింహా హీరో అంటే కంటెంట్ కాస్త భిన్నంగా ఉంటుందనే అర్థం చేసుకోవచ్చు. ఈ పాటను చూస్తే శ్రీ సింహా, కావ్య జంట చాలా ఫ్రెష్‌ గా కనిపిస్తోంది. వారాహి బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఫణిదీప్ డైరెక్ట్ చేశాడు. మొత్తంగా ఈ పాటతో సినిమాపై మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు.

Related Posts