ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే .. నా..?

ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తోన్న సినిమాకు సంబంధించి ఓ కొత్త అప్డేట్ వచ్చింది. కానీ ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. యస్.. బాహుబలి తర్వాత చేసిన సాహో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్ మొత్తానికే పోయింది. అయినా సరే ఆదిపురుష్‌ లా మరో ప్యాన్ ఇండియన్ మూవీ ఉంది కదా.. అనుకున్నారు. బట్ ఈ మూవీని చెప్పిన టైమ్ కు రిలీజ్ చేసే అవకాశాలు లేవట. మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ హల్చల్ చేస్తున్నాయి. ప్రభాస్ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు మాత్రమే ఎదురుచూశారు. ఇప్పుడు ఇండియా మొత్తం అతని మూవీస్ కోసం వెయిట్ చేస్తోంది. డార్లింగ్ కు ఇంత వెయిట్ రావడానికి కారణం బాహుబలి అని కొత్తగా చెప్పక్కర్లేదు. అటుపై వచ్చిన సాహో నార్త్ లో కమర్షియల్ గా సత్తా చాటింది. బట్ తెలుగు వాళ్లను పెద్దగా మెప్పించలేదు. యాక్షన్ హీరోగా మాస్ స్టార్ గా ఓ రేంజ్ లో గుర్తింపు ఉన్న టైమ్ లో రాధేశ్యామ్ అంటూ ఇమేజ్ కు పూర్తి భిన్నమైన స్టోరీ చేయడంతో ఈ కథ బానే ఉన్నా.. ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. దీంతో ఈ మూవీ ఓవరాల్ గా ఫ్లాప్ అనిపించుకుంది. బట్ ప్రభాస్ మూవీస్ లిస్ట్ మాత్రం భారీగానే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో ఆదిపురుష్ చేస్తున్నాడు. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఈ నెలలోనే విడుదల అనుకున్నారు. బట్ కోవిడ్ వల్ల లేట్ అయింది.

ఫైనల్ గా ఆదిపురుష్ ను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇది ఫాంటసీ మూవీ కావడం వల్ల గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయి. ఆ పనులు మాత్రం బాగా ఆలస్యంగా సాగుతున్నాయట. అంటే కేవలం పర్ఫెక్షన్ కోసమే కాస్త నిదానంగా పనిచేస్తున్నారని టాక్. దీంతో ఆదిపురుష్ సంక్రాంతికి కూడా విడుదల కావడం కష్టమే అంటున్నారు. ఈ వార్త ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తుంది. అందుకు కారణమూ లేకపోలేదు. సంక్రాంతికి భారీ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటితో పోటీ పడలేకనే ఆదిపురుష్‌ ను వాయిదా వేశారు అని ఇతర హీరోల ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారనేది వారి భయం. కానీ వీరి భయానికి ప్రాధాన్యత ఇస్తే అటు సినిమా అవుట్ పుట్ బాగా రాదు కదా అనేది మేకర్స్ వెర్షన్. బట్ సంక్రాంతి టార్గెట్ గానే పనులు సాగుతున్నాయట. ఇంకేదైనా సమస్య వస్తే తప్ప పోస్ట్ పోన్ కాదు అని మరికొందరు చెబుతున్నారు. ఆదిపురుష్‌ తో పాటు ప్రభాస్ ఇంకా ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. దీంతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ప్రాజెక్ట్ కె అనే చిత్రమూ ఉంది. అలాగే మారుతితోనూ ఓ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వరుసగా భారీ సినిమాలతో రాబోతున్న ప్రభాస్ ను వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురచూస్తోన్న టైమ్ లో ఈ పోస్ట్ పోన్ అనే ప్రచారం కాస్త ఇబ్బంది పెట్టేదే.

Related Posts