స్టార్ హీరోలంతా ఏదో ఒక బ్రాండ్స్ కు అంబాసిడర్స్ గా ఉంటారు. దీనివల్ల ఆయా బిజినెస్ లు ఫుల్ గా రన్ అవుతాయి. అయితే వీళ్లు బ్రాండ్ అంబాసిడర్స్ గా మాత్రమే కాదు.. బిజినెస్ లు చేయడంలో కూడా తోపులే అనిపించుకుంటారు. నిన్నటి తరం హీరోల్లో బిజినెస్ మేన్ అంటే అంతా నాగార్జుననే చూపించేవారు. ఎంత హీరో అయినా.. బిజినెస్ కు వస్తే ఆయన పక్కాగా ఉంటారు అంటారు. అందుకే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి నాగార్జునకు.
ఈ తరంలో ఒకరిద్దరు కాదు. చాలామంది ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి థియేటర్ బిజినెస్ లవైపు చూస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో ఏసియన్ నెట్ వర్క్ తో కలిసి మహేష్ బాబు ఏఎమ్.బి మాల్ లో భాగస్వామి అయ్యాడు. ఇక్కడ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని అందరికీ తెలుసు.
ఇక ఇదే సంస్థతో కలిసి విజయ్ దేవరకొండ కూడా మహబూబ్ నగర్ లో ఓ మల్టీప్లెక్స్ వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు. ఈ లిస్ట్ లోకి ఐకన్ స్టార్ కూడా చేరిపోయాడు.
హైదరాబాద్ కు ది బెస్ట్ సెంటర్స్ లో ఒకటి అయిన అమీర్ పేటలో ఒకప్పుడు సత్యం థియేటర్ అంటే ఓ రేంజ్ ఉండేది. అయితే ఆ థియేటర్ ను పడగొట్టి అక్కడ ఏసియన్ వారితో కలిసి అల్లు అర్జున్ భాగస్వామిగా ఓ మల్టీప్లెక్స్ కట్టేస్తున్నారు.
నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ మల్టీప్లెక్స్ ను ప్రభాస్ సినిమా ఆదిపురుష్ తో ప్రారంభించబోతుండటం విశేషం.
జూన్ 16న ఆదిపురుష్ విడుదల కాబోతోంది. ఈ మల్టీప్లెక్స్ ను ఇప్పటి వరకూ లేనంత గొప్పగా ఆల్ట్రా మోడ్రన్ టెక్నాలజీతో నిర్మించారట. ఈ థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ఈ నెల 16 నుంచి ఆదిపురుష్ తో ప్రారంభం కాబోతోన్న ”ఏఏఏ” మల్టీప్లెక్స్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. సో.. హైదరాబాద్ సిగలో మరో అందమైన మల్టీ ప్లెక్స్ ఏరియాగా అమీర్ పేట్ నిలవబోతోంది.