దూకుడు పెంచుతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఇప్పటి వరకూ వెండితెరపై కనిపించలేదు. ఆర్ఆర్ఆర్ కోసమే తన టైమ్ అంతా కేటాయించాడు. బట్ ఈ సినిమా పరిస్థితి ఏంటో ఇప్పుడు అందరికీ తెలుసు. ఎల్లుండి విడుదలవుతుంది అన్న టైమ్ లో అనూహ్యంగా మళ్లీ పోస్ట్ పోన్ అయింది. దీంతో ఇక ఆర్ఆర్ఆర్ ను పక్కన బెట్టి తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై కాన్ సెంట్రేట్ చేస్తున్నాడట. ఇందుకోసం ఏకంగా రెండు సినిమాలనూ ఒకేసారి చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు.
ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకునేముందు ఓ రికార్డ్ గురించి చూద్దాం. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకూ 50 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది. అందుకే ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనుకుంటే కుదర్లేదు. త్రివిక్రమ్ తో రెండో సారి ప్రాజెక్ట్ ఓకే కాలేదు. బట్.. ఆ మేరకే కొరటాల శివ ప్రాజెక్ట్ సెట్ అయింది కదా..? త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత సడెన్ గా కొరటాల శివతో సినిమా ఓకే అయింది. ఈ కథను ప్యాన్ ఇండియన్ రేంజ్ లో రాశాడట కొరటాల. వీరి కాంబోలో ఆల్రెడీ వచ్చిన జనతా గ్యారేజ్ లో హిట్ అనిపించుకున్నా.. మరీ బలమైన కంటెట్ అయితే కాదు. ఈసారి అలా కాకుండా బలమైన కథతోనే వస్తున్నట్టు టాక్. ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా ప్రారంభం కాబోతోంది. దీంతో పాటు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా సినిమా కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇది కాస్త డౌటే అంటున్నారు.
కొరటాల, త్రివిక్రమ్ కంటే ముందే వస్తుందనుకున్న సినిమా ప్రశాంత్ నీల్ ది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా ఎప్పుడో రావాలి. కానీ కరోనా వల్ల, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లో చిక్కుకోవడం వల్ల ఆ టైమ కు కుదరలేదు. ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు. ఇది చివరి దశకు వచ్చింది. ఇటు ఎన్టీఆర్ కొరటాల సినిమా ప్రారంభించి కంటిన్యూస్ గా షూట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది సగంలో ఉండగానే ప్రశాంత్ నీల్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నారట. రెండిటినీ ఒకేసారి షూట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ లోగా నిజంగానే బుచ్చిబాబు కథ నచ్చితే అదీ ప్రారంభం అవుతుంది. సో.. ఆర్ఆర్ఆర్ మేటర్ ను ప్రస్తుతం హోల్డ్ లో పెట్టి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై కాన్ సెంట్రేట్ చేశాడట ఎన్టీఆర్.

Related Posts